టిడిపి అభ్యర్థితో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం
కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మార్పీఎస్, టిడిపి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకురాలు స్వర్ణలత, కాజీపేట మండల టిడిపి అధ్యక్షులు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.