
మైదుకూరు: నిరుద్యోగులకు సువర్ణవకాశం
మైదుకూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో డిసెంబర్ 20వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాప్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపేనీల్లో ఖాళీలకు ఎంపిక జరుగుతుందని సంబంధిత అధికారులు శివకృష్ణ, ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని.. మరిన్ని 9398348760, 7731013622 నెంబర్లలో సంప్రదించాలన్నారు.