రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్ లో శనివారం మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిడిపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఇక్కడ నాకు, నాతోపాటు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను, పచ్చి నిజాలను ఆయనకు వివరిస్తానని చెప్పారు.