శాంతియుతంగా, సంతోషంగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం అన్నారు. శ్రీరాముని ఆదర్శాలను స్మరించుకుంటూ, ధర్మం, న్యాయం, ప్రేమ, కరుణ ఆయన జీవితంలోని ముఖ్యమైన అంశాలని, వీటిని మన జీవితాల్లోనూ ఆచరించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.