కడియం: సరస్వతి దేవి సహస్ర పూజలో పాల్గొన్న విద్యార్థులు

58చూసినవారు
కడియం మండలం కడియపులంక శ్రీ హరి హర మహా క్షేత్రం వద్ద దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ అపర్ణాదేవి అమ్మవారు బుధవారం 7వ రోజు 'సరస్వతి దేవి' అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన సరస్వతి దేవి సహస్ర పూజలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్