రాష్ట్రంలో, అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరోసారి ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విమలభాను పౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను అన్నారు. జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండాలో శుక్రవారం ఉదయభాను సతీమణి సామినేని విమలభాను, కుమార్తె పద్మ ప్రియాంక, సోదరి జయశ్రీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.