మేజర్ డ్రైన్ల ప్రక్షాళనకు ఆక్వా రైతులు సహకరించాలి

78చూసినవారు
మేజర్ డ్రైన్ల ప్రక్షాళనకు ఆక్వా రైతులు సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాసు పిలుపునిచ్చారు. మండలంలోని తాడినాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చేపల రైతుల సంఘం నాయకులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడు మేట వేసి నీటి ప్రవాహానికి విఘాతం కలగడంతో నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు నీటమునిగాయన్నారు.

సంబంధిత పోస్ట్