వైసిపి పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ప్రజలు అండగా ఉండాలని తిరువూరు వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. శుక్రవారం రాత్రి తిరువూరు మండలం చిట్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాలంటే వైసిపి పార్టీకే ప్రజలు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.