పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలకు తులాభారం

82చూసినవారు
పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలకు తులాభారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులకు మంగళవారం తులాభారం చేశారు. వినాయక చవితి వేడుకలు సందర్భంగా మంత్రాలయం శ్రీ వరసిద్ధి వినాయక మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో పీఠాధిపతులను పంచదార, మిఠాయి, కాజు, ఎండుద్రాక్ష, బెల్లంతో తులాభారం చేసి భక్తిని చాటుకున్నారు. ఇందులో పండిత కేసరి, మహోపాధ్యాయ రాజా ఎస్ గిరియాచార్యులు, మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్