నాయుడుపేటలో పోలేరమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి

2215చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం భక్తులు కిక్కిరిసి పోయారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంకాలమ్మ ఆలయం నుంచి సారే సమర్పించారు. మహిళలు కోలాటం నిర్వహించారు దీంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. పోలీసులు తగిన బధ్రతా చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్