తనయాలి పంచాయితీలో వైకాపా నేతల ప్రచారం
సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం తనియాలి పంచాయితీలో గురువారం శ్రీ చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.