ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటిని కలిసిన కనియంపాడు నాయకులు
వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామ వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజ గోపాల్ రెడ్డిని దుత్తలూరు లోని పార్టీ కార్యాలయం లో శనివారం కలిశారు. ఈ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కలిసికట్టుగా కృషి తో పని చేసి గొప్ప మెజారిటీతో గెలిపిస్తామని ఆయనకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.