మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ను గెలిపించాలని ఆయన తనయుడు వసంత ధీమాత్ సాయి కోరారు. బుధవారం మైలవరం పట్టణంలో ఎన్నికల శంఖారావం ఆయన పూరించారు. పట్టణ పరిధిలోని చంద్రబాబు నగర్ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.