అది ముమ్మాటికీ వైసీపీ నేతల కుట్రే: ఎమ్మెల్యే స్వామి

62చూసినవారు
సింగరాయకొండ పంచాయితీలోని మూలగుంటపాడులో టీడీపీ నేత ఇంటి ముందు కారు దహనం అయిన విషయం తెలిసిందే. దీని వెనుక వైసీపీకి చెందిన వలస పక్షుల కుట్రే కారణమని కొండేపి ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. ఆ ఘటనకు సంబంధించి శనివారం ఆయన వీడియో విడుదల చేశారు. వైసీపీ వలస పక్షులు సొంత నియోజకవర్గాల్లో అమలు చేసిన అరాచకాలు, హత్యలను ప్రశాంత సింగరాయకొండలో అమలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్