మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: సిపిఎం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ మినుము పంట ఆశా జనకంగా వచ్చిందని, రైతులు సంతోషం వ్యక్తం చేసిన తరుణంలో మినుము కొనుగోలు కేంద్రాలు లేక మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని, మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు పక్కిరి సాహెబ్ అన్నారు. ఆదివారం మల్యాల గ్రామంలో మినుము పంటను రైతు కోసిన పొలంను పరిశీలించారు.