ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలి
కొత్తపల్లి గువ్వలకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేసి, వాటికి రహదారులను ఏర్పాటు చేయాలని సర్పంచు మశమ్మ కోరారు. బుధవారం గువ్వలకుంట్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మేరి, ఎంపీపీ కిచ్చన్నగారి కుసుమలతలకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని సచివాలయం, రైతుభరోసా, హెల్త్ క్లినిక్ల నిర్మాణం అసంపూర్తింగా ఉందని తెలిపారు.