వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ మహేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని, అంతేకాకుండా తప్పనిసరిగా లైసెన్సులను కలిగి ఉండాలని తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని సీఐ తెలియజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.