వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బీసీవై పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా చెముకుల శివ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం రాపూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు బలమైన సామాజిక వర్గంతో పోటీ పడుతున్న నాకు ఓటు వేసి గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంది సేవ చేసుకుంటానన్నారు. గురువారం మధ్యాహ్నం వెంకటగిరిలో నామినేషన్ వేస్తునానన తెలియజేసారు.