మహిళలపై దాడులు అరికట్టాలి

70చూసినవారు
తక్షణమే మహిళలపై దాడులను అరికట్టాలని మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ అనూజ్ రాయ్, డాక్టర్ అంజలి కోరారు. శనివారం మధ్యాహ్నం గజపతినగరం మండలంలోని పురిటిపెంట హెల్త్ వెల్నెస్ సెంటర్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు భద్రత కల్పించాలన్నారు. ఆరోగ్య పర్యవేక్షకులు పైడన్న, జానకి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్