మంత్రి కొండపల్లి ని కలసిన జిందాల్ పరిశ్రమ కార్మికులు

76చూసినవారు
పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును కొత్తవలస జిందాల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎల్ కోటలో మర్యాదపూర్వకంగా కలసి, జిందాల్ పరిశ్రమను పరిశ్రమ యాజమాన్యం లాకౌట్ విధించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్