ఎల్ కోటలో బడికి పోదాం కార్యక్రమం

76చూసినవారు
ఎల్ కోటలో బడికి పోదాం కార్యక్రమం
ఎల్ కోట స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో మంగళవారం ఎంఈఓ కుర్మారావు అధ్యక్షతన బడికి పోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి చేరిక శాతాన్ని పెంచాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పన మెరుగ్గా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మండలంలో గల ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్