సుజల స్రవంతి పనులపై సమీక్ష

54చూసినవారు
ఎస్ కోట నియోజకవర్గంలో నిర్వహించనున్న సుజల స్రవంతి పనులపై ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి మంగళవారం ఎల్ కోట ఆమె స్వగృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సుజల స్రవంతి లెఫ్ట్ కెనాల్ పనుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి మురళీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్