విద్యా కానుక కిట్ల పంపిణీని షురూ చేసిన అధికారులు

58చూసినవారు
విద్యా కానుక కిట్ల పంపిణీని షురూ చేసిన అధికారులు
వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో వేపాడ మండలంలో గల ఆయా ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈఓ లు జగదీశ్వరరావు, బాల భాస్కరరావు ఆధ్వర్యంలో గురువారం విద్యా కానుక కిట్ల పంపిణీని షురూ చేశారు. ఈ నేపథ్యంలో వేపాడ మండల కేంద్రంలో గల విద్యా కానుక స్టాక్ పాయింట్ నుండి పుస్తకాలను తదితర సామగ్రిని మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్