కూటమి అభ్యర్థి మాధవి విజయం తథ్యం: హైపర్ ఆది

565చూసినవారు
నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోకం మాధవి విజయం తథ్యమని సినీ నటుడు, జబర్దస్త్ నటుడు హైపర్ ఆది వెల్లడించారు. భోగాపురం మండలం ముంజేరు జనసేన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. సింహం 2014 ఎన్నికలో సింగిల్ గానే వచ్చి ఓటమి పాలైందని, పిఎం మోది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోనే రాష్ట్రంలో సుస్థిర పాలన సాధ్యమని చెప్పారు. సమావేశంలో కూటమి అభ్యర్థి లోకం మాధవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్