నెల్లిమర్ల సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఇసిఇ విభాగం స్కాలర్ దండు రమేష్ వర్మకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి బుధవారం పిహెచ్. డి ప్రదానం చేశారు. వర్మ చేసిన డిజైన్ ఆఫ్ టెక్స్టైల్ యాంటీనాస్ ఫర్ వైర్ లెస్ బాడి ఏరియా నెట్ వర్క్స్ అండ్ బయోమెడికల్ అప్లికేషన్స్` పరిశోధన అంశానికి ఈ అవార్డు లభించింది. డీన్ ప్రొఫెసర్ మురళీ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది.