APలో అసెంబ్లీకి, పార్లమెంట్కు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తులు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మాధవికి ఏకంగా 894.92 కోట్ల ఆస్తులు ఉన్నాయట.