ప్రజలంతా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఆమె సోమవారం లెండి ఇంజనీరింగ్ కళాశాల, జెఎన్టియుజివిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.