ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ శనివారం పరిశీలించారు. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డైమండ్ జూబ్లీ స్టేడియంలో మెయిన్ ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులను గమనించారు.