వెబ్ సైట్ లో ఎస్టీ కొండ దొర తెగలను తొలగించడం సరికాదు

62చూసినవారు
వెబ్ సైట్ లో ఎస్టీ కొండ దొర తెగలను తొలగించడం సరికాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ సచివాలయంలోని వెబ్సైట్ లో  ఆదివాసీ తెగలు అయిన ఎస్టీ కొండదొర తెగను ప్రభుత్వ వెబ్ సైట్ లో పునరుద్దరించాలని డుంబ్రిగుడ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు వై. ఎస్. బోస్ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కోరారు. గిరిజన తెగలైన కొండ దొర తెగలను గత 90 రోజులుగా ప్రభుత్వ వెబ్ సైట్ లో తొలగించడం చాలా దారుణమని పేర్కొన్నారు. తక్షణమే వెబ్సైట్ లో చేర్చే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్