బెట్టింగ్‌ భూతానికి అనకాపల్లి జిల్లా యువకుడు బలి

61చూసినవారు
క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని, అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా అనకాపల్లి జిల్లాకు చెందిన సోమేశ్వర్‌రావు కుటుంబం మేడ్చల్‌ గుండ్లపోచంపల్లిలో స్థిరపడింది.

సంబంధిత పోస్ట్