డుంబ్రిగూడ మండలం గసబ పంచాయితీ లోగిలి గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరకు అసెంబ్లీ కి కూటమి అభ్యర్ధిగా దొన్నుదొర నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కొర్రా మోహన్ మాట్లాడుతూ జనవరి 20న అరకు లో జరిగిన రా. కదలి రా సభలో మీ ఎమ్మెల్యే అభ్యర్ధి దొన్నుదొర గా ప్రకటిస్తున్నాం గెలిపించుకోండి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని ఇప్పుడు కూటమి తరపున బీజేపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు.