రాకపోకలను నిలిపివేసిన అధికారులు

69చూసినవారు
తుని - నర్సీపట్నం రహదారిలో గన్నవరం మెట్ట వద్ద దొంగ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలను నిలిపివేసినట్లు నాతవరం ఎస్సై రామారావు తెలిపారు. సోమవారం గన్నవరం మెట్ట వద్ద ఆయన పరిస్థితిని పరిశీలించారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఎస్సై సూచించారు. రెండు మూడు గంటల్లో తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. తగ్గిన వెంటనే రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్