వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

79చూసినవారు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ
పెనుగొండ నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని వేెంకటేశ్వరస్వామి ఉపాలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఆలయ అర్చకుడు కోట గిరిధర్‌శర్మ వచ్చే సరికి ఆలయ తలుపు, బీరువా తెరచి ఉండటంతో దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు స్థానిక పోలీసులకు తెలియజేయడంతో పెనుగొండ సీఐ ఎన్‌.రజనీకుమార్, ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్‌ ఘటన స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించి, వివరాలు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్