నామినేషన్ వేసిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి

54చూసినవారు
నామినేషన్ వేసిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, జడ్పిటిసి బాబ్జి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్