ఏలూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరులోని శనివారపుపేట కాజ్వే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో సోమవారం రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏలూరు నుంచి నూజివీడు, దుర్గిరాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.