తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కృష్ణా జల వివాదంపై జరగబోయే విచారణ అంశాలపై చర్చించారు. విచారణకు బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ ముందు స్వయంగా హాజరువుతానని చెప్పారు.