రెస్టారెంట్ లో బిర్యానీ తినడానికి వచ్చిన ఓ కస్టమర్ బొద్దిక రావడంతో ఖంగుతిన్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో చనిపోయిన బొద్దింక వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రెస్టారెంట్లలో ఫుడ్ తినే వారు జాగ్రత్తగా ఉండాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.