ఏపీలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే రిటైర్మెంట్ తరువాత గ్రాట్యుటీని కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ హెల్పర్లకు రూ.1 లక్ష, వర్కర్లకు రూ.40 వేల గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రంలో 1 లక్ష 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది.