డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కార్యకర్తలు
కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ లో జయనగర్ శాతవాహన ఎలక్షన్ బూత్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు సమాచారం తెలియడంతో బిజెపి నాయకులు వెళ్లి వారిని అడ్డుకున్నారు. విషయం బయట పడగానే పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకొని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.