చెట్టు నేలకొరిగి రోజు గడుస్తున్న తొలగించని ఆధికారులు
సిటీలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు, స్థంబాలు నేలకొరిగాయి. పద్మారావు నగర్, వారసిగూడలో కొన్నిచోట్ల చెట్లకొమ్మలు తెగి రోడ్డుకు అడ్డంగా పడడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరోజు గడిచినప్పటికి ఇప్పటివరకు సంభందిత జీహెచ్ఎంసీ తొలగించలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలిన చెట్టు కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.