అమరవీరులకు నివాళులర్పించిన మలిదశ ఉద్యమకారులు

56చూసినవారు
అమరవీరులకు నివాళులర్పించిన మలిదశ ఉద్యమకారులు
బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్టలోని అమర వీరుల స్థూపం వద్ద మలిదశ ఉద్యమకారులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన అమరవీరులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర్ దేశాయ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్, కృష్ణ, సాయిబాబా, చందు, కాల్వ శ్యామ్, దేవేందర్ రెడ్డి. భీమా నాయక్, విజయ్, రాజు, మారుతి, ఖాదర్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్