రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పణ

542చూసినవారు
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లంతకుంట రామాలయానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్షాన రాములోరికి మంగళవారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్