అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కారు తప్పిన పెను ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బుధవారం కారు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు నుండి బీటీపీఎస్ వెళ్తున్న కారు మరో వాహనాన్ని తప్పించబోయి సాంబాయిగూడెం గుట్ట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న వారికి ఏయిర్ బ్యాగ్ ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.