నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అచ్చంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొడ్ల నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బుచ్చి రాములు, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు పాల్గొన్నారు.