గుర్తు తెలియని మృతదేహం లభ్యం

69చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
దేవరకొండ మండలం గిరిజనగర్ తండ సమీపంలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం పాత వాటర్ ప్లాంట్ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న స్థానికుల సమాచారం మేరకు వెళ్లి విచారించగా మృతుడు గత కొద్దిరోజుల నుండి మతిస్థిమితం లేకుండ తిరిగినట్లు తెలిసిందన్నారు. మృతుడి వయస్సు(40), చామనఛాయ, మొలతాడుకు తాయత్తు ఉందని మృతుడిని గుర్తిస్తే 8712670154 నంబర్ కు సమాచారమివ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్