రంజాన్ ఉపవాసంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న యువకుడు

78చూసినవారు
రంజాన్ ఉపవాసంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న యువకుడు
మిర్యాలగూడ మండల కేంద్రంలోని అపోలో ఆసుపత్రిలో బుధవారం నాగేంద్ర అనే పేషంట్ కు శస్త్ర చికిత్స కోసం ఓ పాజిటివ్ రక్తం అత్యవసరం అయ్యింది. ఆ విషయం తెలుసుకున్న సిపాయి బాబా రంజాన్ ఉపవాసంలో ఉండి కూడా వెళ్లి రక్తదానం చేసి మానవత్వం చాటాడు. ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం, 7సార్లు ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసే సమయంలో అక్కడ ఉన్న సామాజిక సేవకులు సిపాయి బాబాను అభినందించారు.

సంబంధిత పోస్ట్