మాడుగులపల్లి మండల పరిధిలోని గారకుంటపాలెం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను తీసుకొని దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని అన్నారు.