ఉపాధి కూలీల మద్దతు కోరిన ఎమ్మెల్యే
పెద్దపల్లి మండలం మూలసాల, బొజ్జన్నపేట గ్రామాల్లో బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఉపాధి హామీ కూలీలను కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణని మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.