వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తిప్పని వెంకటలక్ష్మి (56) అనే ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందింది. గురువారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై పనిచేసే చోటనే అస్వస్థతకు గురికాగా వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. ఉపాధి పనులు చేస్తూ వెంకటలక్ష్మి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.