అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్
అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమీషన్ కల్పించిందని వివరించారు.